Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు కేంద్ర బలగాల భద్రతను తొలగించిన హోంశాఖ

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (14:41 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో పాటు 30 మంది వీఐపీలకు కేంద్ర బలాగల భద్రతను కేంద్ర హోంశాఖ తొలగించింది. వీరికి ఉన్న వ్యక్తిగత ప్రమాదం, ఇతర పరిణామాలను బేరీజు వేసిన తర్వాత వీరికి కల్పిస్తున్న భద్రతను తొలగించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఓ అధికారిక ప్రకటనను వెలువరించింది. 
 
కేంద్ర బలగాల భద్రతను తొలగించిన వారిలో కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబంలోని 8 మంది సభ్యుల, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, టెలికం శాఖ మాజీ మంత్రి, 2జీ స్కామ్ నిందితుడు ఏ. రాజా, జమ్మూకాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కే. సిన్హా, ఎన్‌హెచ్ఆర్సీ ఛైర్ పర్సన్ కేజీ బాలకృష్ణన్, కేరళ గవర్నర్, మాజీ సీజే పి సదాశివం, ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, కేంద్ర మాజీ మంత్రులు సుబోద్ కాంత్ సహాయ్, వీ నారాయణ స్వామి, జితిన్ ప్రసాద్, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ తదితరులు ఉన్నారు.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments