Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాది కసబ్ లాయర్లకు ఫీజు చెల్లించని మహారాష్ట్ర సర్కారు...

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (10:13 IST)
నవంబరు 26 (26/11 కేసు) ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోకి 10 మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేసి మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. ఇది జరిగి సోమవారానికి పదేళ్లు గడిచింది. ఈ దాడిలో దాదాపు సుమారుగా 175 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆస్తినష్టం భారీగా జరిగింది. 
 
ఈ మారణహోమానికి పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా బలగాలు ముట్టుబెట్టగా, కసబ్ అనే ఉగ్రవాదిని మాత్రం పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో కసబ్‌కు ఉరిశిక్ష విధించింది. దీంతో 2012లో కసబ్‌ను పూణెలోని ఎర్రవాడ జైలులో ఉరితీశారు. అయితే, ఈ కేసులో కసబ్ తరపున వాదించిన అమిన్ సోల్కర్, ఫర్హానాలకు ఫీజు మాత్రం ఇంకా చెల్లించలేదు. 
 
కసబ్ తరపున వాదించినందుకు అమిన్‌కు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అందే అంత ఫీజు, అసిస్టెంట్‌ ప్రాసిక్యూటర్‌ స్థాయి ఫీజు ఫర్హానాకు చెల్లించాలని మహారాష్ట్ర సర్కారును బాంబే హైకోర్టు ఆదేశించింది. కానీ, ఇప్పటివరకు వారికి ఫీజు అందలేదు. 'కోర్టు తీర్పు ఇచ్చి ఏడేళ్లైంది. దోషిని ఉరితీశారు. కానీ, ఫీజులు మాత్రం మా చేతికి రాలేదు' అని అమిన్, ఫర్హానాలు వాపోతున్నారు. తనకు చెల్లించాల్సిన బకాయిలు రాబట్టుకునేందుకు చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments