Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాది కసబ్ లాయర్లకు ఫీజు చెల్లించని మహారాష్ట్ర సర్కారు...

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (10:13 IST)
నవంబరు 26 (26/11 కేసు) ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోకి 10 మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేసి మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. ఇది జరిగి సోమవారానికి పదేళ్లు గడిచింది. ఈ దాడిలో దాదాపు సుమారుగా 175 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆస్తినష్టం భారీగా జరిగింది. 
 
ఈ మారణహోమానికి పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా బలగాలు ముట్టుబెట్టగా, కసబ్ అనే ఉగ్రవాదిని మాత్రం పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో కసబ్‌కు ఉరిశిక్ష విధించింది. దీంతో 2012లో కసబ్‌ను పూణెలోని ఎర్రవాడ జైలులో ఉరితీశారు. అయితే, ఈ కేసులో కసబ్ తరపున వాదించిన అమిన్ సోల్కర్, ఫర్హానాలకు ఫీజు మాత్రం ఇంకా చెల్లించలేదు. 
 
కసబ్ తరపున వాదించినందుకు అమిన్‌కు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అందే అంత ఫీజు, అసిస్టెంట్‌ ప్రాసిక్యూటర్‌ స్థాయి ఫీజు ఫర్హానాకు చెల్లించాలని మహారాష్ట్ర సర్కారును బాంబే హైకోర్టు ఆదేశించింది. కానీ, ఇప్పటివరకు వారికి ఫీజు అందలేదు. 'కోర్టు తీర్పు ఇచ్చి ఏడేళ్లైంది. దోషిని ఉరితీశారు. కానీ, ఫీజులు మాత్రం మా చేతికి రాలేదు' అని అమిన్, ఫర్హానాలు వాపోతున్నారు. తనకు చెల్లించాల్సిన బకాయిలు రాబట్టుకునేందుకు చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments