Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే అధినేత కరుణానిధికి అస్వస్థత... కావేరీ ఆస్పత్రిలో చేరిక

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (11:32 IST)
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా... ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య సేవలు కొనసాగుతున్నాయని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే ఆయనకు చికిత్స అందించాల్సి ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, బుధవారమే తన ఇద్దరు కుమారులైన ఎంకే అళగిరి (పెద్ద కుమారుడు), ఎంకే స్టాలిన్ (చిన్న కుమారుడు)లను గోపాలపురంలోని తన నివాసానికి పిలిపించి.. మంతనాలు జరిపిన విషయం తెల్సిందే. దీంతో కరుణానిధి కుటుంబ సభ్యులతో పాటు... డీఎంకే శ్రేణులు సైతం ఎంతో ఆనందానికి గురయ్యారు. ఈ కలయిక జరిగి కొన్ని గంటలకు గడువకముందే కరుణానిధి తిరిగి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments