ఇద్దరు కాదు.. ముగ్గురెళ్లినా ఢోకా లేదు... ఇపుడు రిలాక్సయ్యా : కర్ణాటక సీఎం కుమార స్వామి

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (11:08 IST)
తమ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి స్పందించారు. ఇద్దరు కాదు.. ముగ్గురెళ్లినా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేశారు. కనీస మెజార్టీ కంటే ఎక్కువగానే తమకు మద్దతు ఉందని ఆయన ప్రకటించారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుండగా, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారిలో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్‌లు కూడా ఉన్నారు. వీరిద్దరూ స్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు. 
 
ఈ పరిణామాలపై కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటే పోయిన నష్టమేమి లేదన్నారు. తాను ఎలాంటి ఆందోళన చెందడం లేదన్నారు. తమ బలమేంటో తమకు తెలుసన్న కుమారస్వామి.. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. 
 
ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది కానీ.. తమకు పూర్తి స్థాయి మెజార్టీ ఉందన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఉపసంహరణతో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 120 నుంచి 118కి చేరింది. మేజిక్ ఫిగర్ 113 కాగా, ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments