Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కాదు.. ముగ్గురెళ్లినా ఢోకా లేదు... ఇపుడు రిలాక్సయ్యా : కర్ణాటక సీఎం కుమార స్వామి

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (11:08 IST)
తమ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి స్పందించారు. ఇద్దరు కాదు.. ముగ్గురెళ్లినా తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన స్పష్టం చేశారు. కనీస మెజార్టీ కంటే ఎక్కువగానే తమకు మద్దతు ఉందని ఆయన ప్రకటించారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుండగా, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారిలో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్‌లు కూడా ఉన్నారు. వీరిద్దరూ స్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు. 
 
ఈ పరిణామాలపై కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటే పోయిన నష్టమేమి లేదన్నారు. తాను ఎలాంటి ఆందోళన చెందడం లేదన్నారు. తమ బలమేంటో తమకు తెలుసన్న కుమారస్వామి.. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. 
 
ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది కానీ.. తమకు పూర్తి స్థాయి మెజార్టీ ఉందన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఉపసంహరణతో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 120 నుంచి 118కి చేరింది. మేజిక్ ఫిగర్ 113 కాగా, ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments