Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఇవ్వనున్న కానుక......

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఒక కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం రూ.3.5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును జర్మనీ నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు ర

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (12:49 IST)
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఒక కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం రూ.3.5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును జర్మనీ నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు రాష్ట్రపతి వచ్చినప్పుడు దీన్ని వినియోగిస్తారు. రాష్ట్ర పరిపాలనా విభాగం మరియు ఇంటెలిజెన్స్ విభాగం కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
 
ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ప్రమాదాలను ముందుగానే గుర్తించి, సమాచారాన్ని తెలియజేసే సాంకేతిక పరిజ్ఞానం ఉండటం ఈ కారు ప్రత్యేకత. ఇందులో రక్షణ కోసం 7కుపైగా ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కోణంలో పనిచేసే రహస్య కెమెరాలు ఉంటాయి. సులభంగా డ్రైవింగ్ చేసే విధంగా ఇంటెలిజెన్స్ డ్రైవింగ్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇందులో అదనపు ప్రత్యేకతలు.
 
త్వరలోనే ఈ కారును జర్మనీ నుండి బెంగుళూరుకు తీసుకురానున్నారు. ఈ కారు పూర్తిగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉంటుంది. దీన్ని రాష్ట్రపతికి మాత్రమే కాకుండా ఉప రాష్ట్రపతి, ప్రధాని మరియు ఇతర దేశాల అధ్యక్షుల పర్యటనల కోసం కూడా వినియోగించే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments