Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఇవ్వనున్న కానుక......

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఒక కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం రూ.3.5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును జర్మనీ నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు ర

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (12:49 IST)
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఒక కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం రూ.3.5 కోట్ల మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును జర్మనీ నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక పర్యటనకు రాష్ట్రపతి వచ్చినప్పుడు దీన్ని వినియోగిస్తారు. రాష్ట్ర పరిపాలనా విభాగం మరియు ఇంటెలిజెన్స్ విభాగం కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
 
ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ప్రమాదాలను ముందుగానే గుర్తించి, సమాచారాన్ని తెలియజేసే సాంకేతిక పరిజ్ఞానం ఉండటం ఈ కారు ప్రత్యేకత. ఇందులో రక్షణ కోసం 7కుపైగా ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కోణంలో పనిచేసే రహస్య కెమెరాలు ఉంటాయి. సులభంగా డ్రైవింగ్ చేసే విధంగా ఇంటెలిజెన్స్ డ్రైవింగ్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇందులో అదనపు ప్రత్యేకతలు.
 
త్వరలోనే ఈ కారును జర్మనీ నుండి బెంగుళూరుకు తీసుకురానున్నారు. ఈ కారు పూర్తిగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉంటుంది. దీన్ని రాష్ట్రపతికి మాత్రమే కాకుండా ఉప రాష్ట్రపతి, ప్రధాని మరియు ఇతర దేశాల అధ్యక్షుల పర్యటనల కోసం కూడా వినియోగించే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments