Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారస్వామికి బీఎస్పీ ఎమ్మెల్యే షాక్... ఓటింగ్‌కు దూరంగా...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (17:53 IST)
కర్నాటక రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వం ఎదుర్కొంటున్న విశ్వాస పరీక్ష రోజుకో విధంగా కీలక మలుపులు తిరుగుతోంది. కుమారస్వామి ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశం మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్ విశ్వాస పరీక్షకు దూరంగా ఉండనున్నారు. 
 
కర్నాటకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెల్సిందే. అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌కు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హెచ్ డీ కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ప్రకటించిన బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ యూటర్న్‌ తీసుకున్నారు. 
 
సోమవారం జరుగనున్న విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనను కోరారని ఎమ్మెల్యే ఎన్ మహేశ్ అన్నారు. తాను పార్టీ (బీఎస్పీ) అధిష్టానం ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో సభకు హాజరు కాబోనని స్పష్టంచేశారు. తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే మహేశ్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments