Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికూర కోసం తండ్రీకొడుకుల డిష్యూం డిష్యూం.. కుమారుడు హతం

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:35 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కోడికూర కోసం తండ్రీ కొడుకులు గొడవపడ్డారు. దీంతో క్షణికావేశంలో కుమారుడిని తండ్రి కర్రతో కొట్టడంతో చనిపోయాడు. కుమారుడు ఇంటికి వచ్చేలోపు కోడికూరను తండ్రి తినేశాడు. దీంతో ఆగ్రహంచిన కుమారుడు... తండ్రితో గొడవకు దిగడంతో ఈ దారుణం జరిగింది.

తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా సునీయా తాలూకా గుత్తికర్ గ్రామానికి షీనా, శివరామన్ అనే తండ్రీ కుమారులు ఉన్నారు. మంగళవారం ఇంట్లో వండిన కోడికూరను షీనా తినేశాడు. ఆ తర్వాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్ తెలిసి ఆగ్రహంతో తండ్రితో గొడవపడ్డారు.

ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్‌‌ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివరామన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments