Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికూర కోసం తండ్రీకొడుకుల డిష్యూం డిష్యూం.. కుమారుడు హతం

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:35 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కోడికూర కోసం తండ్రీ కొడుకులు గొడవపడ్డారు. దీంతో క్షణికావేశంలో కుమారుడిని తండ్రి కర్రతో కొట్టడంతో చనిపోయాడు. కుమారుడు ఇంటికి వచ్చేలోపు కోడికూరను తండ్రి తినేశాడు. దీంతో ఆగ్రహంచిన కుమారుడు... తండ్రితో గొడవకు దిగడంతో ఈ దారుణం జరిగింది.

తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా సునీయా తాలూకా గుత్తికర్ గ్రామానికి షీనా, శివరామన్ అనే తండ్రీ కుమారులు ఉన్నారు. మంగళవారం ఇంట్లో వండిన కోడికూరను షీనా తినేశాడు. ఆ తర్వాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్ తెలిసి ఆగ్రహంతో తండ్రితో గొడవపడ్డారు.

ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్‌‌ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివరామన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments