కోడికూర కోసం తండ్రీకొడుకుల డిష్యూం డిష్యూం.. కుమారుడు హతం

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:35 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కోడికూర కోసం తండ్రీ కొడుకులు గొడవపడ్డారు. దీంతో క్షణికావేశంలో కుమారుడిని తండ్రి కర్రతో కొట్టడంతో చనిపోయాడు. కుమారుడు ఇంటికి వచ్చేలోపు కోడికూరను తండ్రి తినేశాడు. దీంతో ఆగ్రహంచిన కుమారుడు... తండ్రితో గొడవకు దిగడంతో ఈ దారుణం జరిగింది.

తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా సునీయా తాలూకా గుత్తికర్ గ్రామానికి షీనా, శివరామన్ అనే తండ్రీ కుమారులు ఉన్నారు. మంగళవారం ఇంట్లో వండిన కోడికూరను షీనా తినేశాడు. ఆ తర్వాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్ తెలిసి ఆగ్రహంతో తండ్రితో గొడవపడ్డారు.

ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్‌‌ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివరామన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments