Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వ్యవహారంలో వెనక్కి తగ్గని కర్ణాటక... కాలేజీ గేటు వద్దే..?

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (10:31 IST)
కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంలో వెనక్కి తగ్గట్లేదు. హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజీ గేటు వద్దే అడ్డుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత నెలల నుంచి ఇప్పటి వరకూ ఐదు కళాశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉడుపి జిల్లాల్లోని కుందాపూర్, ఉడుపి, బిందూర్‌లో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను అడ్డుకున్నారు. 
 
హైకోర్టు ఈ వివాదంపై తీర్పు వెలువరించేవరకూ అన్ని విద్యా సంస్థల్లో యూనిఫామ్ నిబంధనలు పాటించాలని శుక్రవారం పునరుద్ఘాటించింది. ఈ అంశంపై చర్చించడానికి అడ్వొకేట్ జనరల్‌తో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీవీ నగేశ్‌‌లు సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తెలియజేయాలని సూచించారు.
 
 సమావేశం అనంతరం మంత్రి నగేశ్ మాట్లాడుతూ.. ఈ వివాదం ఇప్పటికే హైకోర్టుకు చేరినందున తీర్పు కోసం వేచిచూస్తున్నాం.. అప్పటి వరకూ అన్ని పాఠశాలలు, కాలేజీలు స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ మోనటరింగ్ కమిటీలు నిర్దేశించిన డ్రెస్‌కోడ్‌ను తప్పనిసరిగా అనుసరించాలి’ అని తెలిపారు. కర్ణాటక విద్యా చట్టం ప్రకారం.. డ్రెస్‌కోడ్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యా సంస్థలకు ఇవ్వబడిందన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments