Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిపై కన్నేసిన యజమాని.. చంపేసిన ప్రియుడు..

Webdunia
మంగళవారం, 4 మే 2021 (11:16 IST)
తాను ప్రేమిస్తున్న యువతిపై ఓ కంప్యూటర్ సెంటర్ యజమాన్ని కన్నేశాడనీ ఆ యువతి ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ కంప్యూటర్ యజమానిని చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన ముకుందన్ అనే వ్యక్తి నగరంలో ఓ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నాడు. ఇందులో ఇక్కడ ఓ యువతి పని చేస్తూ వచ్చింది. ఆ యువతిపై ముకుందన్ మనసుపడ్డాడు. ఆమె మనస్సు గెలుచుకుని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆమె అంగీకరకపోవడంతో పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. 
 
అదేసమయంలో ఆ యువతికి అప్పటికే రాజేంద్ర ప్రసాద్ అనే యువకుడుతో ప్రేమలోపడింది. యజమాని వేధింపులు తాళలేక పనిమానేసింది. అయినప్పటికీ అతను ఫోన్ చేసి వేధించసాగాడు. దీంతో తన ప్రియురాలి సలహాతో ముకుందన్‌ను మెల్విన్ అనే స్నేహితుడి సాయంతో రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్‌ 28న హత్య చేశాడు. అండర్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments