మందుల కోసం ఆరాటం.. యువతి టిక్‌టాక్ - స్పందించిన కర్నాటక సీఎం

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (10:55 IST)
తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని, లాక్‌డౌన్ కారణంగా బయటకెళ్లి మందులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. సాయం చేయండంటూ ఓ యువతి సెల్ఫీ వీడియో చేసి, దాన్ని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప దృష్టికెళ్లింది. దీంతో ఆయన తక్షణం స్పందించి అధికారులను ఆదేశించగా, అధికారులు ఇంటికెళ్లి నెల రోజులకు సరిపడ మందులు సమకూర్చారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకా, నరసాపుర గ్రామానికి చెందిన శేఖవ్వ అనే మహిళ రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో ఆమె భర్త ఓ కిడ్నీని దానం ఇచ్చారు. జనవరిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆపై ఆమె మందులు వాడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. 
 
అయితే, కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఫలితంగా గత 20 రోజులు శాఖవ్వకు కావాల్సిన మందులు దొరకని పరిస్థితి ఏర్పడటంతో, ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె కుమార్తె పవిత్ర, తల్లి బాధను చెబుతూ, టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ అయి, యడియూరప్పను చేరగా, ఆయన సూచనతో, జిల్లా అధికారులు నిన్న శాఖవ్వ ఇంటికి వెళ్లారు. నెల రోజులకు సరిపడా మందులను అందించారు. మరేదైనా సమస్య ఏర్పడితే, తమకు తెలియజేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments