Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమైన కొన్ని గంటల్లోనే వధువు మృతి.. కర్ణాటకలో దారుణం

Webdunia
శనివారం, 3 జులై 2021 (11:10 IST)
వివాహమైన కొన్ని గంటల్లోనే వధువు ప్రాణాలు కోల్పోయింది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వధువును మృత్యువు కబళించిన ఈ దుర్ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా సింధగి తాలూకా బి.కె.యలగల్ల గ్రామంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రాణి (26)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో పెండ్లి కొడుకు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 
 
పెండ్లి మంటపం నుంచి బంధువులతో కలిసి క్రూసర్‌ వాహనంలో నవ దంపతులు శుక్రవారం ఉదయం కూకటనూరు గ్రామానికి దైవదర్శనం కోసం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టెంపో ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. నవ వధువు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులు సింధగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సింధగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments