Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 యేళ్ల మనవడి కోసం 73 యేళ్ల బామ్మ కిడ్నీదానం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (09:21 IST)
కర్నాటక రాష్ట్రంలో 73 యేళ్ల బామ తన మనవడి కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడింది. ఏడు పదుల వయసులో కూడా తన కిడ్నీ దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. అదేసమయంలో తన మనవడి ప్రాణాలను కూడా కాపాడుకుంది. రాష్ట్రంలోని బెళగావిలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని బెళగావి సమీపంలోని హరుగేరికి చెందిన 21 యేళ్ల సచిన్‌ చిన్నప్పటి నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇంతకాలం మందులతో నెట్టుకొచ్చారు. ప్రస్తుతం సచిన్‌కు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ దానం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమైనప్పటికీ.. వారి అనారోగ్యం కారణంగా వైద్యులు నిరాకరించారు. 
 
దీంతో ఆరోగ్యంగా ఉన్న 73 యేళ్ల బామ... తన మనవడిని బతికించుకోవడానిక కిడ్నీ ఇస్తానంటూ ముందుకు వచ్చారు. దీంతో డాక్టర్ రవీంద్ర మద్రా సారథ్యంలోని వైద్యులు బెళగావిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ కిడ్నీ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంతో ఉన్నారని, 73 యేళ్ల వయసులోనూ బామ కిడ్నీ దానం చేయడం గొప్ప విషయమని వైద్యులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments