Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 యేళ్ల మనవడి కోసం 73 యేళ్ల బామ్మ కిడ్నీదానం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (09:21 IST)
కర్నాటక రాష్ట్రంలో 73 యేళ్ల బామ తన మనవడి కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడింది. ఏడు పదుల వయసులో కూడా తన కిడ్నీ దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. అదేసమయంలో తన మనవడి ప్రాణాలను కూడా కాపాడుకుంది. రాష్ట్రంలోని బెళగావిలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని బెళగావి సమీపంలోని హరుగేరికి చెందిన 21 యేళ్ల సచిన్‌ చిన్నప్పటి నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇంతకాలం మందులతో నెట్టుకొచ్చారు. ప్రస్తుతం సచిన్‌కు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ దానం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమైనప్పటికీ.. వారి అనారోగ్యం కారణంగా వైద్యులు నిరాకరించారు. 
 
దీంతో ఆరోగ్యంగా ఉన్న 73 యేళ్ల బామ... తన మనవడిని బతికించుకోవడానిక కిడ్నీ ఇస్తానంటూ ముందుకు వచ్చారు. దీంతో డాక్టర్ రవీంద్ర మద్రా సారథ్యంలోని వైద్యులు బెళగావిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ కిడ్నీ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంతో ఉన్నారని, 73 యేళ్ల వయసులోనూ బామ కిడ్నీ దానం చేయడం గొప్ప విషయమని వైద్యులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments