Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య స్కూల్‌లో కరోనా కలకలం.. 60 మంది విద్యార్థులకు పాజిటివ్

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (13:29 IST)
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు విద్యాలయాలు కరోనా నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్కూల్‌ను వచ్చేనెల 20 వరకు మూసివేశారు.
 
ఆదివారం సాయంత్రం శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన ఓ విద్యార్థి వామ్‌టింగ్ చేసుకున్నట్లు, డయేరియాతో ఇబ్బందిపడుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. వెంటనే తారు ఆ క్యాంపస్‌లో ఉన్న మొత్తం 480 మందికి పరీక్షలు నిర్వహించామని, అందులో 60 మందికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు.
 
అయితే పాజిటివ్‌గా తేలిన వారిలో ఇద్దరిలోనే లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరో వారం రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైరస్ సోకినవారిలో 46 మంది కర్ణాటకు చెందినవారుకాగా, మిగిలిన 14 మంది తమిళనాడుకు చెందినవారని తెలిపారు. శ్రీచైతన్య రెసిడెన్సియల్ స్కూల్‌ను నెలరోజుల క్రితమే పునఃప్రారంభించారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments