Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాదిలో 2 సార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారు : కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా

ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మాటలదాడి చేశారు. కేజ్రీవాల్‌.. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సీఎం కార్యాలయానిక

Webdunia
బుధవారం, 17 మే 2017 (13:37 IST)
ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మాటలదాడి చేశారు. కేజ్రీవాల్‌.. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారంటూ ట్విటర్‌ ద్వారా కామెంట్స్‌ చేశారు. తమ అవినీతి బాగోతం బయటపడటంతో ఆప్‌ నేతలు భయపడుతున్నారని.. వారికి కేజ్రీవాల్‌ ధైర్యం చెప్తున్నారంటూ పోస్ట్ చేశారు. 
 
"ఈ అవినీతి ఆరోపణలు ప్రజలు మరో 15 రోజుల్లో మర్చిపోతారు. వారికి భయపడకండి అని కేజ్రీవాల్‌ ఆప్‌ నేతలకు చెబుతున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరు మాత్రమే చాలా తక్కువగా ఉంది. కార్యాలయానికి వెళ్లకుండా, మంత్రులతో ఎలాంటి సమావేశాలకు హాజరుకాని ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. అంతేకాదు ఎక్కువగా సెలవులు పెడుతూ అవినీతి కేసులు ఉన్న సీఎం కూడా కేజ్రీవాలే" అంటూ విమర్శలు చేశారు. 
 
ఢిల్లీ నగర పాలక సంస్థకు అవసరమైన మంచినీటి ట్యాంకర్లను కొనుగోలు చేసే విషయంపై డొల్ల కంపెనీల ద్వారా సీఎం కేజ్రీవాల్‌ రూ.2 కోట్లు లంచం తీసుకోవడం తాను కళ్లారా చూశానని కపిల్‌ మిశ్రా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మిశ్రాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కాగా.. ఈ విషయమై మిశ్రా సీబీఐకి ఫిర్యాదు చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments