టీ కోసం భార్యాభర్తల గొడవ.. భార్య నదిలో దూకేసింది.. మొసలి కనిపించింది.. చివరికి?

సెల్వి
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (10:01 IST)
Crocodile
టీ కోసం భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ వివాదం కాస్త చిలికి చిలికి పెద్దదిగా మారింది. దీంతో భార్య కోపంతో సమీపంలో ఉన్న నదిలోకి దూకింది. అయితే క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమెకు దూకిన తర్వాత తప్పు అనిపించి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. ఆ సమయంలో ఒడ్డుమీదున్న భారీ మొసలిని చూసి ఒక్కసారిగా ఖంగుతింది. ఆపై భయంతో వణికిపోయిన ఆ మహిళ.. చివరికి ఒక పని చేసి ప్రాణాలు కాపాడుకుంది. ఈ ఘటన కాన్పూర్‌లోని అహిర్వాన్‌లో చోటుచేసుకుంది. 
 
సురేష్ అనే వ్యక్తి తన భార్య మాల్టితో తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతుండేవాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి కూడా అలానే తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తన భార్యను టీ తయారు చేయమని అడగగా.. తాను బాగా అలసిపోయానని.. ఇప్పుడు పెట్టలేనని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య వాదన మొదలైంది. 
 
దీంతో కోపంతో నదిలో దూకేసింది.  దీంతో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని.. ఒడ్డు వైపుకు ఈదుకుంటూ వచ్చింది. ఆమె ఒడ్డుకు చేరుకోగానే అకస్మాత్తుగా నీటిలో ఒక పెద్ద మొసలి కనిపించింది. అప్పుడే తనకు సమీపంలో ఒక చెట్టు కనిపించింది. ఎలాగైన తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో.. ఆమె త్వరగా దానిపై ఎక్కి రాత్రంతా అక్కడే కూర్చుంది. మరుసటి రోజు ఇంటికి చేరుకుంది. స్థానికులు, పోలీసుల సాయంతో ఆమెను చెట్టుపై నుంచి కిందకు దించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments