Webdunia - Bharat's app for daily news and videos

Install App

154 స్థానాల్లో కమల్‌ పార్టీ పోటీ..

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (10:00 IST)
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య పొత్తులు కుదురుతున్నాయి.

ఇప్పటికే ప్రధాన పార్టీలైన డిఎంకె - కాంగ్రెస్‌, అన్నాడిఎంకె - బిజెపి ల మధ్య సీట్ల పంపకం కొలిక్కిరాగా... తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సినీనటుడు కమలహాసన్‌ పలు పార్టీలో కలిసి పోటీకి సమాయత్తమవుతున్నారు.


కమలహాసన్‌ మాట్లాడుతూ.. 234 అసెంబ్లీ స్థానాలుండగా 154 స్థానాల్లో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) బరిలో దిగనున్నట్లు ప్రకటించారు.

కూటమిలో భాగస్వాములైన ఆలిండియా సమతువ మక్కల్‌ కచ్చి, ఇందియా జననాయగ కచ్చికి 80 స్థానాలను కేటాయించినట్లు తెలిపారు. రెండు పార్టీలు చెరో 40 స్థానాల్లో పోటీ చేస్తాయని కమల్‌ పేర్కొన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం నాలుగు శాతం ఓట్లు సాధించింది. పట్టణంలో ఓటింగ్‌ 10 శాతం అధికంగా ఉంది. ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు, కోయంబత్తూర్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ మహేంద్రన్‌ మొత్తం ఓట్లలో 11.6 శాతం సాధించారు.

ఇదిలా ఉండగా.. పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments