Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కమల్‌నాథ్‌కే.. రాజస్థాన్ ఎవరికో?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:30 IST)
సస్పెన్స్‌కు తెరపడింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కమల్‌నాథ్‌ ఎంపికయ్యారు. సీఎం రేసులో చివరివరకు పోటీలో నిలచిన యువనేత జ్యోతిరాదిత్య సింథియాకు చుక్కెదురైంది. అనుభవంతో పాటు యువతరం మధ్య జరిగిన రసవత్తర పోరులో కాంగ్రెస్ అధిష్టానం అనుభవానికే పెద్దపీట వేసింది. 
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం కమల్‌నాథ్, యువనేత జ్యోతిరాధిత్య సింథియాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గురువారం రోజంతా తీవ్ర తర్జన భర్జనల తర్వాత ఎంపీ సీఎంగా కమల్‌నాథ్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. 
 
నిజానికి భోపాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధిష్టాన పరిశీలకులుగా సీనియర్లు ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, శోభా ఓజా తదితరులు పాల్గొన్నారు. 
 
సీఎల్పీ భేటీ తర్వాత కమల్‌నాథ్ పేరును మధ్యప్రదేశ్ సీఎంగా అధికారికంగా ప్రకటించారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం కూడా ఎవరూ ఉండబోరని స్పష్టంచేసింది. మొన్నటి ఎన్నికల్లో చింద్వారా నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ పోటీచేసి గెలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments