Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగిగా అనుమానించి కొట్టి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:42 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ వ్యక్తి కరోనా రోగి అని అనుమానించిన స్థానికులు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, థానే జిల్లాలోని కల్యాణ్‌ పట్టణానికి చెందిన గణేష్‌ గుప్తా అనే వ్యక్తి నిత్యావసర సరుకుల కోసం బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆయన వెళ్తున్న మార్గంలో పోలీసులు కనిపించేసరికి మరో దారిలో నడిచి వెళుతున్నాడు. 
 
అయితే, ఆయనకు ఒక్కసారిగా దగ్గురావడంతో పెద్దగా దగ్గాడు. దీంతో అక్కడున్న స్థానికులంతా కలిసి గుప్తాను కరోనా రోగిగా అనుమానించి చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గుప్తా అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
 
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిచేసిన వ్యక్తులను గుర్తించేందుకు సమీపంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments