Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగిగా అనుమానించి కొట్టి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:42 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ వ్యక్తి కరోనా రోగి అని అనుమానించిన స్థానికులు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, థానే జిల్లాలోని కల్యాణ్‌ పట్టణానికి చెందిన గణేష్‌ గుప్తా అనే వ్యక్తి నిత్యావసర సరుకుల కోసం బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆయన వెళ్తున్న మార్గంలో పోలీసులు కనిపించేసరికి మరో దారిలో నడిచి వెళుతున్నాడు. 
 
అయితే, ఆయనకు ఒక్కసారిగా దగ్గురావడంతో పెద్దగా దగ్గాడు. దీంతో అక్కడున్న స్థానికులంతా కలిసి గుప్తాను కరోనా రోగిగా అనుమానించి చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గుప్తా అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
 
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిచేసిన వ్యక్తులను గుర్తించేందుకు సమీపంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments