Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగిగా అనుమానించి కొట్టి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:42 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ వ్యక్తి కరోనా రోగి అని అనుమానించిన స్థానికులు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, థానే జిల్లాలోని కల్యాణ్‌ పట్టణానికి చెందిన గణేష్‌ గుప్తా అనే వ్యక్తి నిత్యావసర సరుకుల కోసం బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆయన వెళ్తున్న మార్గంలో పోలీసులు కనిపించేసరికి మరో దారిలో నడిచి వెళుతున్నాడు. 
 
అయితే, ఆయనకు ఒక్కసారిగా దగ్గురావడంతో పెద్దగా దగ్గాడు. దీంతో అక్కడున్న స్థానికులంతా కలిసి గుప్తాను కరోనా రోగిగా అనుమానించి చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గుప్తా అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
 
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిచేసిన వ్యక్తులను గుర్తించేందుకు సమీపంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments