Webdunia - Bharat's app for daily news and videos

Install App

దటీజ్ వృద్ధ బ్రహ్మచారి ఛరిష్మా... పార్టీ ఓడినా... ఆయన రికార్డులు మాత్రం ఆగలేదు

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (10:57 IST)
రాజస్థాన్ రాష్ట్ర ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కాషాయ కంచుకోట బద్ధలైంది. రాజస్థాన్ వాసులు హస్తానికి పట్టంకట్టారు. అంటే కమల దళం మట్టికరవగా, కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం దక్కించుకుంది. 
 
ఈ క్రమంలో బీజేపీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైనప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం విజయంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయనే కైలాష్ మేఘావాల్. 5సార్లు ఎమ్మెల్యేగా, 3సార్లు ఎంపీగా పనిచేశారు. స్పీకర్‌గా పనిచేసిన మేఘవాల్ తన పార్టీ ఓడిపోయినా.. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మహావీర్‌ ప్రసాద్‌పై 74,542 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
 
అవివాహితుడు అయిన 84 యేళ్ళ కైలాష్.. తాజా ఎన్నికల్లో షాపురా నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈయన 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి కైలాశ్‌ పోటీ చేసి...43,666 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఈసారి మరో 30 వేల ఓట్లను అదనంగా సాధించి గెలుపొందడం గమనార్హం. 
 
ఉదయ్‌పూర్‌లో 1934 మార్చి 22న జన్మించిన కైలాశ్‌ మేఘవాల్‌ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు కీలక పదవులు నిర్వహించారు. ఈ నియోజకవర్గ వాసులు పార్టీ కంటే ఆయన వ్యక్తిగత ఛరిష్మాకే పట్టంకట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments