Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేత అవధేష్ కుమారులు అంత పనిచేశారా? ఎయిర్‌ హోస్టెస్‌పై?

బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్‌ ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలపై అవధేష్‌ కుమారులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే

Webdunia
ఆదివారం, 20 మే 2018 (13:47 IST)
బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్‌ ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలపై అవధేష్‌ కుమారులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్‌లో బాధితురాలు పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులు పట్నాలో ఉంటారు. 
 
తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసి వెళ్లేందుకు ఆమె పట్నాకు వచ్చింది. అవధేష్ కుమారుడు సుషాంత్ రంజన్‌కు ఎయిర్ హోస్టెస్‌కు ముందే పరిచయం వుంది. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ పరిచయంతో డిన్నర్‌కు ఆహ్వానించాడు సుశాంత్. వారు చెప్పిన చోటకు ఆమె వెళ్లింది. అక్కడే సుశాంత్ సోదరుడు ప్రశాంత్ కూడా ఉన్నాడు.
 
ఇద్దరూ కలిసి ఆమెను బంధించి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తండ్రికి చెందిన గెస్ట్ హౌస్‌లో ఆమెను బంధించి, వెళ్లిపోగా, అక్కడి ఉద్యోగుల సాయంతో బయటపడ్డ ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత కేసు నమోదు చేసుకునేందుకు వెనుకాడిన పోలీసులు, ఆపై 24 గంటల తరువాత కేసు పెట్టి దర్యాఫ్తు ప్రారంభించారు. కానీ అవధేష్ మాత్రం బాధితురాలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. ఆమె చేసే ఆరోపణల్లో నిజం లేదంటున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం