Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సమక్షంలో జార్ఖండ్ సీఎం సొరేన్‌కు బీజేపీ కార్యకర్తల అవమానం!

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (09:36 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రధానితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే బీజేపీయేతర ముఖ్యమంత్రులను అవమానపరుస్తున్నారు. తొలుత హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడాను ఆ తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను హేళన చేశారు. ఈ సంఘటనలు మంగళవారం చోటు చేసుకున్నాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు సంస్కారహీనులని, సభామర్యాదలు తెలియవంటూ బాధిత సీఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రధాని మోడీ సమక్షంలోనే బీజేపీ కార్యకర్తల హేళనను ఎదుర్కొన్న వీరిద్దరు ఇకపై తాము ప్రధాని పాల్గొనే సమావేశాల్లో పాల్గొనబోమని తెగేసి చెప్పారు. మరోవైపు బీజేపీ కార్యకర్తల ప్రవర్తనకు భయపడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రథ్వీరాజ్‌ చవాన్‌ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమానికి ఏకంగా డుమ్మానే కొట్టారు. నాగ్‌పూర్‌లో ప్రధాని పాల్గొన్న మెట్రో ప్రాజెక్ట్‌ శంకుస్థాపనకు గైర్హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి హాజరు కావాలని స్వయంగా బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్య నాయుడు ఫోన్‌ చేసినా చవాన్‌ సారీ చెప్పారు. బీజేపీ కార్యకర్తల చేతిలో అవమానం పాలు కావడం ఇష్టం లేకే చవాన్‌ ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments