Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేని నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతక ప్రేమికుడు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (09:24 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ యువకుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. యువతి నిద్రపోతున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్కండ్ రాష్ట్రంలోని దుమ్కాలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న అంకిత(19)ను షారుక్‌ హుస్సేన్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తూ వచ్చాడు. అందుకు అంకిత అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న హుస్సేన్ ఈ నెల 25వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 
 
ఫలితంగా ఆమె శరీరం 90 శాతం మేరకు కాలిపోయింది. రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి దాటాక (ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు) అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడంతో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న హుస్సేన్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments