Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో క్షుద్రపూజలు.. తండ్రి శవం ముందు ఆరు నెలల పాటు..

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (14:28 IST)
జార్ఖండ్‌లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆయన్ను మళ్లీ బతికించాలనుకున్నాడు. ఇందు కోసం ఆరు నెలలుగా శవానికి పూజలు చేశాడు. కానీ చివరికి అరెస్టయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ఇందిరాకాలనీకి చెందిన విశ్వనాథ్ ప్రసాద్  (75) కొద్దికాలం క్రితం అనారోగ్యంతో ఈ ఏడాది మే నెలలో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ తండ్రికి అంత్యక్రియలు చేయకుండా.. తండ్రిని పూజల ద్వారా బతికిస్తానని నమ్మబలికాడు. 
 
ఇందుకోసం శవాన్ని రసాయనాలతో భద్రపరిచాడు. గత ఆరు నెలల పాటు తండ్రి శవం ముందు కూర్చుని పూజలు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి శవానికి అంత్యక్రియలు తల్లి, సోదరి చెప్పినా వినిపించలేదు. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ప్రశాంత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments