Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో క్షుద్రపూజలు.. తండ్రి శవం ముందు ఆరు నెలల పాటు..

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (14:28 IST)
జార్ఖండ్‌లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆయన్ను మళ్లీ బతికించాలనుకున్నాడు. ఇందు కోసం ఆరు నెలలుగా శవానికి పూజలు చేశాడు. కానీ చివరికి అరెస్టయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ఇందిరాకాలనీకి చెందిన విశ్వనాథ్ ప్రసాద్  (75) కొద్దికాలం క్రితం అనారోగ్యంతో ఈ ఏడాది మే నెలలో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ తండ్రికి అంత్యక్రియలు చేయకుండా.. తండ్రిని పూజల ద్వారా బతికిస్తానని నమ్మబలికాడు. 
 
ఇందుకోసం శవాన్ని రసాయనాలతో భద్రపరిచాడు. గత ఆరు నెలల పాటు తండ్రి శవం ముందు కూర్చుని పూజలు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి శవానికి అంత్యక్రియలు తల్లి, సోదరి చెప్పినా వినిపించలేదు. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ప్రశాంత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments