Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌ను గాలికి వదిలేసి.. కాక్‌పిట్‌లో తన్నుకున్న పైలట్లు

కొందరు పైలట్లు క్షణికావేశానికి లోనవుతుంటారు. ఇలాంటివారి వల్ల విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (11:19 IST)
కొందరు పైలట్లు క్షణికావేశానికి లోనవుతుంటారు. ఇలాంటివారి వల్ల విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఇద్దరు పైలట్లు తాము నడుపుతున్న ఫ్లైట్‌ను గాలికి వదిలేసి కాక్‌పిట్‌లో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొత్త సంవత్సరం రోజైన జనవరి ఒకటో తేదీన జెట్ ఎయిర్‌వేస్ విమానం 324 మంది ప్రయాణికులతో లండన్ నుంచి ముంబై బయలుదేరింది. సమాచార మార్పిడిలో లోపం కారణంగా కాక్‌పిట్‌లోని పైలట్ల మధ్య వివాదం తలెత్తింది. తొలుత చిన్నగా మొదలైన వాగ్వాదం చివరికి బాహాబాహీకి దారి తీసింది. 
 
ఈ ఇద్దరు పైలట్లు విమానాన్ని పట్టించుకోకుండా ఘర్షణకు దిగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే కాసేపటికే పైలట్ల మధ్య వివాదం సమసిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. పైలట్లు గొడవకు దిగడం నిజమేనని జెట్ ఎయిర్‌వేస్ ధ్రువీకరించింది. ఘర్షణకు దిగిన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించి, విచారణకు ఆదేశించినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments