Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు గుండెపోటు.. తమిళనాడులో హైటెన్షన్... రంగంలోకి కేంద్ర బలగాలు

అన్నాడీఎంకే జయలలితకు గుండెపోటు వచ్చింది. ఈ వార్త తెలియడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గర లక్షలాది మంది అమ్మ అభిమానులు గుమికూడారు.

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (01:15 IST)
అన్నాడీఎంకే జయలలితకు గుండెపోటు వచ్చింది. ఈ వార్త తెలియడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గర లక్షలాది మంది అమ్మ అభిమానులు గుమికూడారు. దీంతో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రితో పాటు.. చెన్నై నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. అంతేకాకుండా, కేంద్ర బలగాలను కూడా రప్పించి.. మొహరించారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల బందోబస్తు చర్యలు చేపట్టారు. 
 
జయలలితకు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా... ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్లర్లకు అవకాశం ఇవ్వకుండా చూడటానికి తమిళనాడు ఆదివారం అర్థరాత్రి నుంచి పోలీసులు నాకాబందీ కొనసాగిస్తున్నారు. 
 
మరోవైపు... అమ్మ జయలలిత ఆరోగ్యం కుదటపడాలని ఆదివారం అర్థరాత్రి నుంచి తమిళనాడులో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి చెన్నైతో పాటు తమిళనాడులోని పలు దేవాలయాల తలుపులు తీయించి పూజలు చేస్తున్నారు. రాత్రికిరాత్రి చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో రోడ్లలోనే హోమాలు చేస్తూ అమ్మ ఆరోగ్యం కుదటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.
 
జయలలిత ఆరోగ్యం విషమించడంతో జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితులు అదుపుతప్పుతాయని భావించిన ప్రభుత్వ పెద్దలు రంగంలోకి పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. ఇందుకోసం కేంద్రం మూడు కంపెనీల పారామిలిటరీ బలగాలను పంపించినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments