Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు కొత్త సీఎం పన్నీర్ సెల్వం : ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు!

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (11:56 IST)
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖామంత్రి ఒ.పన్నీర్ సెల్వం మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ కె రోశయ్య నుంచి ఆహ్వానం అందింది. తమిళనాడులో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నేత పన్నీర్ సెల్వంకు ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆహ్వానం పంపారు. అయితే, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పన్నీర్ సెల్వం తర్జనభర్జనలు చెందుతున్నారు. జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయడమే ఇందుకు నిదర్శనం. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితకు ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. ఫలితంగా ఆమె స్థానంలో కొత్త వారసుడి ఎంపిక జయలలిత ఆదేశం మేరకు ఆదివారం రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో జయలలిత సూచన మేరకు.. తన వీరవిధేయుడు, మంత్రి పన్నీర్ సెల్వంను ఏడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 
 
ఆ తర్వాత శాసనసభపక్ష నేత హోదాలో పన్నీర్ సెల్వం రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ లేఖను అందజేశారు. ఫలితంగా పన్నీర్ సెల్వంను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments