అమ్మ అంత్యక్రియల్లో జేబుదొంగల చేతివాటం.. చితక్కొట్టిన ప్రజలు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అంత్యక్రియల్లో జేబుదొంగలు తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శించారు. ఫలితంగా అనేక మంది తమ వస్తువులను పోగొట్టుకున్నారు.

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (09:30 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అంత్యక్రియల్లో జేబుదొంగలు తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శించారు. ఫలితంగా అనేక మంది తమ వస్తువులను పోగొట్టుకున్నారు. ఈ జేబుదొంగలు జేబుల్లోని పర్సులను నొక్కేస్తూ... ప్రజలకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇలాంటివారిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. 
 
సోమవారం రాత్రి కన్నుమూసిన జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరిగిన విషయం తెల్సిందే. తమ నాయకురాలికి తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం విషాదంలో మునిగిపోయారు. ఇదే అదునుగా భావించిన సురేష్, దినేష్‌లతో పాటు.. మరికొందరు దొంగలు పలువురి నుంచి సెల్ ఫోన్లు, నగదును దోచుకున్నారు. 
 
జయలలిత పార్థీవదేహం ఉంచిన రాజాజీ హాలు నుంచి మెరీనా బీచ్ వరకు ఈ దొంగలు పలు చోరీలు చేశారు. చోరీలు చేస్తూ తోడు దొంగలు ప్రజలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో వారిని పోలీసులకు అప్పగించారు. దొంగల నుంచి రూ.30 వేల నగదుతోపాటు 10 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని వేలూరు జిల్లా గుడియాత్తం వాసులుగా గుర్తించారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని యజమానులకు అప్పగిస్తామని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments