Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ - మధుమేహం సమస్యలతో జయలలిత... సింగపూర్‌కు తరలించే యోచనలో వైద్యులు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించాలన్న యోచనలో వైద్యులు ఉన్నట్టు సమాచారం.

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (12:37 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించాలన్న యోచనలో వైద్యులు ఉన్నట్టు సమాచారం. 
 
రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన జయలలితను ప్ర‌స్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గత రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మెరుగుపడక పోవడంతో ఆమెను సింగ‌పూర్ త‌ర‌లించాలని యోచిస్తున్నారు. 
 
జ‌య‌ల‌లిత‌కు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మ‌రింత మెరుగైన చికిత్సను అందించ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని, జ్వ‌రం త‌గ్గింద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రికి సాధార‌ణ ఆహారాన్నే ఇస్తున్న‌ట్లు పేర్కొన్నాయి. 
 
మరోవైపు జ‌య‌ల‌లిత అభిమానులు, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ త‌మిళ‌నాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఆసుప‌త్రి వ‌ద్దకు వారు చేరుకుంటున్నారు. జయలలిత త్వ‌ర‌గా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు తెలుపుతూ ప్రధాని మోడీ ఆమెకు బొకే పంపించారు. అందుకు జ‌య‌ల‌లిత స్పందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు లేఖ రాశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments