Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆభరణాలు : 21 కేజీల బంగారం.. వజ్రాలు... 500 వైన్ గ్లాస్‌లు ఎవరికి సొంతం?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి వేతనం తీసుకుంటూ భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం.

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (15:20 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి వేతనం తీసుకుంటూ భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసు విచారణ ఇప్పటికీ సాగుతోంది. అయితే, ఈ కేసులో ప్రధాన ముద్దాయి జయలలిత కావడం, ఆమె ఇపుడు చనిపోవడంతో ఈ కేసు ఇంతటితో ముగిసే అవకాశం ఉంది. 
 
అయితే, ఆమెకు సొంతమైన చీరలు, ఖరీదైన చెప్పుల జతలు వంటివి ఇప్పటికీ కర్ణాటక కోర్టుల కస్టడీలో ఉన్నాయి. దీంతో ఇవన్నీ ఇప్పుడు ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న తలెత్తుతోంది. త్వరలోనే సుప్రీంకోర్టు దీనిపై తీర్పు వెలువరించి ఆ ఆస్తులను రిలీజ్ చేస్తుందని, జయ స్మారకార్థం ఏర్పాటు చేసే మ్యూజియంలో వాటిని ప్రదర్శన కోసం ఉంచే అవకాశాలుంటాయని అన్నాడీఎంకే సీనియర్ నేతలు అంటున్నారు. 
 
వాస్తవానికి 1996లో ఆదాయం పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రస్తుతం కర్ణాటక పోలీసుల సంరక్షణలో ఉన్నాయి. ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న 10,500 చీరలు, 750 చెప్పుల జతలు, 500 వైన్ గ్లాసులతో పాటు.. 3.5 కోట్ల రూపాయలు విలువచేసే 21.28 కేజీల స్వర్ణాభరణాలు, 1.250 కేజీల వెండి వస్తువులు, 2 కోట్ల రూపాయలు విలువచేసే వజ్రాలు, వెండి కత్తి వంటివి ఉన్నట్టు సమాచారం. 
 
బెంగుళూరు సిటీ సివిల్ కోర్టు మొదటి అంతస్థులోని ఒక గదిలో భద్రపరిచారు. వీటికి నలుగురు పోలీసులు షిఫ్టుల వారిగా కాపలా ఉన్నారు. ఈ కేసు తమిళనాడు నుంచి కర్ణాటకకు బదలీ కావడంతో 2002లో ఈ వస్తువులన్నింటినీ ఐటి అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఆ గదిలో ఏమున్నాయనేది తమకు తెయదని సాయుధ రిజర్వ్ పోలీసులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments