Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం జయలలిత మృతి కేసు.. వారం రోజులు వాయిదా

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:59 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుపై విచారణను వారం రోజులు వాయిదా వేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబరు 5న జయలలిత మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో... జయలలిత మృతిపై విచారణ చేపట్టేందుకు మాజీ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఓ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విచారణ పూర్తికాకపోవడంతో కమిషన్‌ను ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. 
 
జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి తరపున సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసు జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణకు అడ్డంకిగా మారిందనే విమర్శలున్నాయి. అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ తరపున హాజరైన న్యాయవాదులు, కేసుకు సంబంధించి నలుగురు సాక్షులను విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం కోర్టు వారం రోజులు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments