Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం జయలలిత మృతి కేసు.. వారం రోజులు వాయిదా

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:59 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుపై విచారణను వారం రోజులు వాయిదా వేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబరు 5న జయలలిత మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో... జయలలిత మృతిపై విచారణ చేపట్టేందుకు మాజీ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఓ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విచారణ పూర్తికాకపోవడంతో కమిషన్‌ను ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. 
 
జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి తరపున సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసు జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణకు అడ్డంకిగా మారిందనే విమర్శలున్నాయి. అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ తరపున హాజరైన న్యాయవాదులు, కేసుకు సంబంధించి నలుగురు సాక్షులను విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం కోర్టు వారం రోజులు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments