Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను దోషిగా ప్రకటించలేం.. రూ.100కోట్ల జరిమానాగా విధించలేం: సుప్రీం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పును సవరించాలంటూ.. గత నెలలో కర్ణాటక సర్కారు దాఖ

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:07 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పును సవరించాలంటూ.. గత నెలలో కర్ణాటక సర్కారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తోసిపుచ్చింది. జయలలితను దోషిగా తేల్చడంతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధించాలని కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంను విజ్ఞప్తి చేసింది. 
 
ఇంకా జరిమానాను జయలలిత కూడబెట్టిన ఆస్తులను వేలం వేయడం ద్వారా వసూలు చేయాలని కర్ణాటక విజ్ఞప్తి చేసింది. కానీ ఈ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. ఆమె మరణించిన నేపథ్యంలో జరిమాన విధించడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. అయితే శశికళకు విధించిన జరిమానాను వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. 
 
కాగా, జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం రూ.2.79 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని జరిమానా విధించడం ద్వారా రాబట్టుకోవాలని కర్ణాటక విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments