Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మను సీసీయూ నుంచి ప్రైవేట్ రూమ్‌కు మారుస్తాం.. డిశ్చార్జ్ మాత్రం చెప్పలేం: ప్రతాప్ రెడ్డి

నవంబర్ నాలుగో తేదీ (శుక్రవారం) జయలలిత ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని.. కొన్ని రోజుల తర్వాత ఆమెను సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) నుంచి మర

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (17:58 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె పూర్తిగా కోలుకుంటున్నారని, కొన్ని రోజుల్లో యథాతథంగా రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఎస్.రామచంద్రన్ ధీమా వ్యక్తం చేశారు. డీహైడ్రేషన్, జ్వరంతో బాధపడుతున్న సీఎం జయలలిత సెప్టెంబర్ 22నుంచి చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 
 
అయితే అమ్మకు సంబంధించిన హెల్త్ బులెటిన్ చివరగా అక్టోబర్ 21న విడుదలచేశారు. ఆ తర్వాత జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన, సమాచారం లేకపోవడంతో ఇది ఎన్నో అనుమానాలకు దారితీసింది. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో జయ చికిత్స తీసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో నవంబర్ నాలుగో తేదీ (శుక్రవారం) జయలలిత ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని.. కొన్ని రోజుల తర్వాత ఆమెను సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) నుంచి మరో గదిలోకి మారుస్తామని స్పష్టం చేశారు. చికిత్స పట్ల జయలలిత సంతృప్తి వ్యక్తం చేయగా, ఆమెకు కావాల్సినవి అడుగుతున్నారని తెలిపారు. అయితే జయలలితని డిశ్చార్జ్ చేసే అంశం మాత్రం తమ పరిధిలో లేదని స్పష్టం చేశారు.
 
చైన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే.. జయలలిత ఆరోగ్యం కుదుటపడిందని అన్నాడీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పొన్నియన్ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments