Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ ప్రధాని కిషిదకు పానీపూరి రుచి చూపించిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (15:07 IST)
అధికారిక పర్యటన కోసం న్యూఢిల్లీకి జపాన్ దేశ ప్రధాని ఫుమియో కిషిద భారతీయ వంటకాలను రుచి చూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరుండి మరీ ఈ వంటకాలను తినిపించారు. ముఖ్యంగా, భారత్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరీ (గోల్‌గప్ప)ని ఆయనకు తినిపించారు. భారతీయ పానీ4పూరి రుచి జపాన్ ప్రధాని ఎంతగానో నచ్చడంతో ఆయన లొట్టలేసుకుని ఆరగించారు. 
 
భారత్‌, జపాన్‌ మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించేందుకు గానూ ఇరు దేశాల ప్రధానులు సోమవారం ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్‌ను సందర్శించారు. ఉద్యానవనమంతా కలియదిరుగుతూ వీరిద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి ఫుడ్‌ స్టాళ్ల వద్దకు వెళ్లి భారతీయ అల్పాహార వంటకాలను, పానీయాలను రుచిచూశారు. 
 
ఇరు దేశాల ప్రధానులు కవ్వంతో మజ్జిక చిలికారు. ఆ తర్వాత కిషిదకు ప్రధాని మోడీ పానీపూరీ గురించి చెప్పి దాని రుచి చూపించారు. ఆ రుచిని అమితంగా ఇష్టపడిన జపాన్‌ ప్రధాని ఇంకోటి కావాలని అడిగారు. పానీపూరీతో పాటు ఫ్రైడ్‌ ఇడ్లీ, మామిడితో చేసిన షర్‌బత్‌ను కిషిద రుచిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments