Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్యంలో అశాంతి.. జపాన్ ప్రధాని టూర్ రద్దు.. మమత ఫైర్

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:52 IST)
పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత ఈశాన్య భారతావనిలో అశాంతి నెలకొంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాం రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా ఆదివారం భారత పర్యటనకు రావాల్సిన జపాన్ ప్రధాని షింజో అబే, తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన జిజి ప్రెస్ వెల్లడించింది.
 
ఆదివారం అసోంలోని గువాహటిలో షింజో అబే, నరేంద్ర మోడీ మధ్య చర్చలు జరగాల్సి వుంది. ఈ సమయంలో అసోంలో పరిస్థితులు అనుకూలంగా లేవని భావించిన అబే, ఇండియాకు రాకపోవచ్చని సమాచారం. ఎలాగైనా సదస్సును నిర్వహించేందుకు భారత, జపాన్ ప్రభుత్వాలు మార్గాన్వేషణ చేస్తున్నాయని తెలుస్తోంది.
 
కాగా, ఇప్పటికే భారత్‌కు రావాల్సిన బంగ్లాదేశ్ విదేశీ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, హోమ్ మంత్రి అసదుజ్జామన్ ఖాన్‌లు తమ మేఘాలయ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు, జపాన్ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దుచేసుకోవడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది మన దేశానికే 'మాయని మచ్చ' అంటూ ఆమె దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) కారణంగా అసోంలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో అబే తన భారత పర్యటన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
అబే తన భారత పర్యటన వాయిదా వేసుకునే యోచనలో ఉన్నారంటూ ఇవాళ ఉదయమే జపాన్ మీడియా సంస్థ జీజీ ప్రెస్ వెల్లడించింది. మరికొద్ది సేపటికే ఈ పర్యటన రద్దు చేసుకునేందుకు భారత్, జపాన్ అంగీకరించాయని.. త్వరలోనే అనువైన మరో తేదీన ఈ పర్యటన పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments