Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంజార్‌లో భారీ వరదలు : నలుగురి మృతి - 40 మంది గల్లంతు

Jammu and Kashmir
Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:51 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్టావర్ సమీపంలోని హంజార్ అనే ఏరియాలో బుధవారం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా గృహాలు కొట్టుకునిపోయాయి. ఈ వరదల కారణంగా నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. 
 
ఈ వరదల కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కిష్టావర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెళికితీశామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భారత వాయు సేన కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుందని వెల్లడించారు.
 
కాగా, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరించింది. నదుల్లో నీటి ప్రవాహం పెరగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments