Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంజార్‌లో భారీ వరదలు : నలుగురి మృతి - 40 మంది గల్లంతు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:51 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్టావర్ సమీపంలోని హంజార్ అనే ఏరియాలో బుధవారం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా గృహాలు కొట్టుకునిపోయాయి. ఈ వరదల కారణంగా నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. 
 
ఈ వరదల కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కిష్టావర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెళికితీశామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భారత వాయు సేన కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుందని వెల్లడించారు.
 
కాగా, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరించింది. నదుల్లో నీటి ప్రవాహం పెరగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments