Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంజార్‌లో భారీ వరదలు : నలుగురి మృతి - 40 మంది గల్లంతు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:51 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్టావర్ సమీపంలోని హంజార్ అనే ఏరియాలో బుధవారం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా గృహాలు కొట్టుకునిపోయాయి. ఈ వరదల కారణంగా నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. 
 
ఈ వరదల కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కిష్టావర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెళికితీశామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భారత వాయు సేన కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుందని వెల్లడించారు.
 
కాగా, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరించింది. నదుల్లో నీటి ప్రవాహం పెరగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments