Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంజార్‌లో భారీ వరదలు : నలుగురి మృతి - 40 మంది గల్లంతు

Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:51 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్టావర్ సమీపంలోని హంజార్ అనే ఏరియాలో బుధవారం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా గృహాలు కొట్టుకునిపోయాయి. ఈ వరదల కారణంగా నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. 
 
ఈ వరదల కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కిష్టావర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెళికితీశామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భారత వాయు సేన కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుందని వెల్లడించారు.
 
కాగా, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరించింది. నదుల్లో నీటి ప్రవాహం పెరగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments