Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం.. పోటీలను ప్రారంభించనున్న సీఎం పన్నీర్ సెల్వం

జల్లికట్టు క్రీడ కోసం తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆమోదం తెలిపారు. దీంతో ఆదివారం మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలను ఆ

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (17:16 IST)
జల్లికట్టు క్రీడ కోసం తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆమోదం తెలిపారు. దీంతో ఆదివారం మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం పచ్చజెండా ఊపి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి మదురైకు బయలుదేరినట్టు సమాచారం.
 
మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరుపై అన్నాడీఎంకే ఎంపీలు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. జల్లికట్టుకు సంబంధించి తమ ఎంపీలు యేడాది కాలంగా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారని... కానీ, మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నాడీఎంకే నేత తంబిదురై ఆరోపించారు. మోడీ తీరు తమకు తీవ్ర నిరాశను మిగిల్చిందని చెప్పారు. 
 
జల్లికట్టు కోసం త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. జల్లికట్టు అంశాన్ని పరిష్కరించాలని అమ్మ జయలలిత గతంలోనే కేంద్రాన్ని కోరారని... కానీ, కేంద్ర ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తంబిదురై విమర్శించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments