Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూక దాడుల నుంచి రక్షణ కల్పించండి ప్లీజ్.. ప్రధానికి సెలెబ్రిటీల లేఖ

Webdunia
బుధవారం, 24 జులై 2019 (17:32 IST)
దేశంలో వివిధ ప్రాంతాల్లో మూకదాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు సెలెబ్రిటీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖ రాసిన 49 మంది సెలెబ్రిటీలలో సినీ, పాత్రికేయ రంగానికి చెందిన శ్యామ్ బెనగల్, అనురాగ్ కశ్యప్, రామచంద్ర గుహ తదితరులు ఉన్నారు.
 
దేశంలో అసహనం, మూకదాడులు హెచ్చుమీరిపోతున్నాయనీ, ఇప్పటివరకు 1094 దాడులు జరిగాయని లేఖలో తెలిపారు. కులం పేరుతో దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని వారు కోరారు. దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 
 
మూకదాడుల కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు విధించాలని, పెరోల్ కూడా ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. జైశ్రీరామ్ పేరుతో మూకదాడులు చేయడం బాధాకరం అన్నారు. జైశ్రీరామ్ పేరుతో శాంతి భద్రతల సమస్యలు సష్టించడాన్ని తప్పుపట్టారు. దేశంలో పరిస్థితులు మరింత దిగజారకముందే ప్రధాని మోడీ చర్యలు చేపట్టాలని సెలబ్రిటీలు విజ్ఞప్తి చేశారు. 
 
ఇప్పటికే దళితులు, మైనార్టీలు అభద్రతా భావంలో ఉన్నారని.. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకున్నారని సెలబ్రిటీలు వాపోయారు. ఎప్పుడు ఎక్కడ మూకదాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. దళితులు, మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలవాలని.. భద్రతపై వారికి భరోసా కల్పించాలని సెలబ్రిటీలు ప్రధానిని డిమాండ్ చేశారు. అసహనం, మూకదాడులను ప్రస్తావిస్తూ 49 మంది సెలబ్రిటీలు ప్రధాని మోడీకి లేఖ రాయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments