Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్మారెడ్డి చెప్పింది నిజమే.. మరో టిడిపి పారిశ్రామికవేత్తపై ఐటీ పంజా..?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (21:31 IST)
ఆపరేషన్ గరుడ నటుడు శివాజీ మొదట్లో చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి. కేంద్రం టిడిపి నేతల్ని టార్గెట్ చేస్తోంది. మొదటగా మంత్రులను టార్గెట్ చేసి ఆ తరువాత చంద్రబాబు నాయుడుకు ఉచ్చు బిగుస్తుందని చెప్పారు. చెప్పినట్లుగానే వరుసగా ఐటీ, ఇడీ దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే నెల క్రితం నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా మరో 20 మంది టిడిపి నేతలు, టిడిపికి సపోర్ట్ చేసే పారిశ్రామిక వేత్తలపై దాడులు జరిగే అవకాశముందని ప్రకటించారు. 
 
భరద్వాజ చెప్పినట్లుగానే నేటి ఉదయం నుంచి టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన కంపెనీల మీద దాడులు కొనసాగిస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపుపన్ను కట్టేలేదని మాగుంట శ్రీనివాసులరెడ్డిపై ఆరోపణలున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సిబ్బందిని మాత్రమే లోపల పెట్టి తనిఖీలు కొనసాగుతున్నాయి. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. అయితే వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు ఐటీ అధికారులు. ఐటీ అధికారులు మరోసారి దాడులు కొనసాగిస్తుండడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments