Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోలో 650 కార్యాలయాలపై దాడులు.. అప్పుడు ఇల్లు లేదు.. ఇప్పుడు శ్రీమంతులు!

Webdunia
గురువారం, 7 జులై 2022 (14:49 IST)
Dolo 650
కరోనా వైరస్ మహమ్మారి దేశంలో తాండవం చేస్తున్న సమయంలోనే డోలో 650 మాత్రలు తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ కంపెనీ నిర్వాహకులు సంవత్సరంలో సుమారు రూ.450 కోట్లకు పైగా వ్యాపారం చెయ్యడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
 
ఈ నేపథ్యంలో దేశంలో ఔషదాలు (మందులు) తయారు చేస్తున్న 17 కంపెనీల్లో మైక్రో ల్యాబ్స్ సంస్థ భారీ లాభాలు సొంతం చేసుకుని తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఇదే మైక్రో ల్యాబ్ సంస్థ సీఎండీ దిలీప్ సురానా, ఆ కంపెనీ డైరెక్టర్ ఆనంద్ సురానా (సురానా బ్రదర్స్) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపారు. 
 
తాజాగా డోలో 650 మాత్రలు తయారు చేస్తున్న బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మైక్రో ల్యాబ్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం బెంగళూరులోని రోస్ కోర్స్ రోడ్డులో ఉంది. 
 
బెంగళూరులోని కార్యాలయంతో పాటు చెన్నై, తమిళనాడు, గోవా, పంజాబ్, సిక్కీం తదితర 40 ప్రాంతాల్లో బుధవారం ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేసి పలు పత్రాలు పరిశీలిస్తున్నారు.
 
ఒకప్పుడు ఉండటానికి బెంగళూరులో సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అధినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా ఈ రోజు భారతదేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చోటు సంపాధించుకున్నారు. అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసే దిలీప్ సురానా చెన్నై నుంచి బెంగళూరు చేరుకుని అద్దె ఇంటిలో ఉండేవారు.
 
శ్రీమంతుల జాబితాలో 94వ స్థానం
ఇప్పుడు భారతదేశంలోని 100 మంది కోటీశ్వరుల జాబితాలో సురానా బ్రదర్స్ 94వ స్థానంలో ఉన్నారు. ఆదాయపన్ను ఎగగెట్టారని ఆరోపణలు రావడంతో బెంగళూరు నగరంలోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతో పాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments