Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎంగా శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు : సుబ్రమణ్య స్వామి

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నార

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:10 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. తమిళనాడు సీఎంగా ఓ పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించి.. ఆ స్థానంలో శశికళ బాధ్యతలు స్వీకరించవచ్చనే ఊహాగానాలు బలంగా వస్తున్నాయి. వీటిపై సుబ్రమణ్య స్వామి స్పందించారు. 
 
తమిళనాడు ముఖ్యమంత్రిగా వీకే శశికళ ప్రమాణ స్వీకారం చేస్తే, రాష్ట్రానికి అంతకన్నా దరిద్రం మరొకటి ఉండదన్నారు. "శశికళ సీఎంగా కాకుండా ఎలాంటి నిషేధమూ లేదు. అయితే, ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. ఆమెపై సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఉంది. ఓ నిందితురాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమేంటి? రాష్ట్రానికి మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో పదవిని చేపట్టడం రాష్ట్రానికి మంచిది కాదు" అని ఆయన అన్నారు. 

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments