Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళను దోషిగా ప్రకటించడం చారిత్రాత్మకం : ఎంకేస్టాలిన్

జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ‘చారిత్రాత్మక’మైనదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభ ప్రతి

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (12:44 IST)
జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ‘చారిత్రాత్మక’మైనదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభ ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. 
 
తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 'రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం తర్వాత న్యాయం జరిగింది. ఇది చారిత్రాత్మక తీర్పు' అని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో రాజకీయ నేతలు ఎలాంటి ప్రవర్తనతో నడుచుకోవాలో సుప్రీం తీర్పు మార్గనిర్దేశనం చేసిందన్నారు. 
 
"అవినీతి, అక్రమాలకు పాల్పడే నేతలెవ్వరూ ఎవరూ తప్పించుకోలేరని ఈ తీర్పు చాటిచెప్పింది. ప్రజాజీవితంలో నిజాయితీ చాలా అవసరం. రాజకీయ నేతలందరికీ ఇదో గొప్ప గుణపాఠం" అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి పీఠానికి జరిగే బలపరీక్షలో డీఎంకే వైఖరి ఏమిటని కోరగా... 'డీఎంకే ఎల్లప్పుడూ దేశ ప్రయోజనం వైపే నిలబడుతుంది' అని సమాధానమిచ్చారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments