Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో మరో ఘనత... జీశాట్ 31 సక్సెస్...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:49 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 31 ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుండి విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు నింగిలోకి వెళ్లిన ఏరియానా రాకెట్ 42 నిమిషాల్లోనే నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 
 
విజయవంతంగా నింగిలోకి ఎగిరిన ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. కాగా జీశాట్ 31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్-4 ఉపగ్రహాన్ని కూడా అందులో చేర్చారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేసారు. 2535 కిలోలు ఉన్న ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సమాచార సేవలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
 
అత్యంత సమర్థవంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థను కలిగి ఉన్న జీశాట్ 31 ఇస్రో సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్‌శాట్, జీశాట్‌లకు అత్యాధునిక రూపంగా నిపుణులు పరిగణిస్తున్నారు. ఈ ఉపగ్రహం భారతీయ భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని అందిస్తుంది. ఇది వరకే భూస్థిర కక్ష్యలో గల ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఈ ఉపగ్రహం అదనపు సమాచార సేవలను అందించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments