Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ-సీ38 రాకెట్ ప్రయోగం సక్సెస్.. చరిత్ర నెలకొల్పిన ఇస్రో

ఇస్రో మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పీఎస్ఎల్వీ-సీ 38 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం పీఎస్‌ఎల్‌వీ-సీ 38 వాహననౌకను ఇస్రో శాస్త్రవేత్తలు

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (10:34 IST)
ఇస్రో మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పీఎస్ఎల్వీ-సీ 38 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం పీఎస్‌ఎల్‌వీ-సీ 38 వాహననౌకను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. భూపరిశీలక ఉపగ్రహం కార్టోశాట్-2తోపాటు వివిధ దేశాలకు చెందిన 30 నానో శాటిలైట్ల (ఉపగ్రహాలు)ను పీఎస్‌ఎల్‌వీ-సీ 38 వాహననౌక ద్వారా శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
 
కక్ష్యలోకి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సహా 14 దేశాలకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కార్టోశాట్-2 ఉపగ్రహంతో భూపరిశీలన సామర్థ్యం మెరుగుపడనుంది. కార్టోసాట్-2 ఉపగ్రహం బరువు 712 కిలోలు కాగా.. మిగిలిన 30 ఉపగ్రహాల బరువు 243 కిలోలు. ఉపగ్రహాలన్నీ 505 కిలోమీటర్ల ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశపెట్టబడ్డాయి. ఈ 30 ఉపగ్రహాల్లో ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఫిన్ లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, లాత్వియా, లిథువేనియా, స్లొవేకియా, బ్రిటన్, ఆమెరికాలకు చెందిన 29 చిన్న ఉపగ్రహాలుండగా ఒకటి మాత్రం కన్యాకుమారిలోరి నూర్-ఉల్-ఇస్లాం యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించింది.
 
కాగా, (పీఎస్‌ఎల్‌వీ)- సీ38 ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర నెలకొల్పిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గడచిన రెండు నెలల కాలంలో 50 రోజులు ఇస్రోకు చాలా క్లిష్టమైన సమయమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే ఈ 50 రోజులలో ఇస్రో మూడు అంతరిక్ష ప్రయోగాలు చేసిందని గుర్తుచేశారు. మూడు ప్రయోగాలు అత్యంత భారీ వ్యయంతో కూడినవని, ప్రతిష్టాత్మకంగా భావించి, మూడు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ విజయం ఇస్రోకు మరింత స్ఫూర్తినివ్వగా, ఇస్రో ఖ్యాతిని మరింతగా పెంచిందని వారు అభిప్రాయపడ్డారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments