Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో దాడులకు ఉగ్రవాదుల కుట్ర: దసరా, దీపావళి పండుగలే టార్గెట్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (22:38 IST)
భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చిరించాయి. భారత్‌లోని చొరబడేందుకు 40మంది ఆఫ్ఘన్ ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఐఈడీ బాంబులతో బీభత్సం చేయాలని భావిస్తున్నాయని ఐబీ అంచనా వేసింది. 
 
జన సంచారం ఎక్కువగా ఉన్న చోట బాంబు పేల్చాలని అనుకుంటున్నాయని తెలిపింది. త్వరలో దసరా, దీపావళి పండగ వస్తోన్న సంగతి తెలిసిందే. అందుకోసం జనం షాపింగ్ కోసం.. ఇతర పనుల మీద వెళతారు. ఇదీ వారి టార్గెట్ అని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.
 
పండగ సమయంలోనే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని వివరించాయి.  జమ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. 
 
దేశంలో రాబోయే పండగ రోజుల్లో దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు ముందస్తు హెచ్చరికలు చేయడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇక, జమ్మూకాశ్మీర్‌లో గురువారం పాక్‌నుంచి ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments