Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం జయలలితకు అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో అడ్మిట్

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు... కేవలం మానసికంగా అలసిపోవడం వల్ల కలిగ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:29 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు... కేవలం మానసికంగా అలసిపోవడం వల్ల కలిగిన అస్వస్థతేనని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 
 
అయితే, జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో ఆమెను గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. 
 
అమ్మ అనారోగ్యం పాలవడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఆరోగ్యం గురించి పార్టీ నేతలతో పాటు తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆమె అనారోగ్యంతో బాధపడేవారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments