Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌరవ సభలా మారిన అసెంబ్లీ.. ద్రౌపదిలా మారిన జయలలిత.. కానీ తగ్గేదేలే!?

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (18:40 IST)
Jayalalithaa
అసెంబ్లీలో మహిళల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలు ఇప్పుడిప్పుడే తమ ఉనికిని చాటుతున్నారు. గతంలో ఎన్నో అవమానకరమైన ఘటనలు అసెంబ్లీలలో జరిగాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలితను నిండు సభలో అవమానించారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
 
1989లో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం దుర్మార్గం, అవినీతి చేస్తోందని ఓ మహిళా నాయకురాలు నిండు సభను ప్రశ్నించారు. ఆధారాలన్నీ చూపిస్తా అంటూ గట్టిగా అరిచారు. ఈ క్రమంలో ఆమెపై అధికార పార్టీకి చెందిన కొందరు ఒక్కసారిగా రెచ్చిపోయి ఎదురుదాడికి దిగారు. చివరికి జుట్టు పట్టుకుని కొట్టడానికి కూడా వచ్చారు. 
 
తీవ్రంగా అవమానించారు. అప్పటి వరకు అత్యంత గౌరవప్రదమైన అసెంబ్లీగా ఉన్న తమిళనాడు శాసనసభ ఆ ఒక్క సంఘటనతో కౌరవ సభగా మారింది.
 
 కౌరవులు, పాండవులు నిండిన సభలో తమిళనాడు అసెంబ్లీలో మహిళా నాయకురాలు జయలలిత ద్రౌపదిలా అవమానానికి గురయ్యారు. అదే సమయంలో ఆ మహిళా నాయకురాలు భీకర కెరటంలా ఏడ్చి అదే సభా వేదికపై పడి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేసింది. ఆఖరికి ఆ నిండు సభలో ప్రజల మన్ననలతో అఖండ మెజారిటీతో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచారు.
 
ఆమె జీవితమంతా పోరాటమే. ఆమె ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొని తమిళ ప్రజల హృదయాలను గెలుచుకుంది. చివరకు జయలలిత అనే పేరు నుంచి అందరి చేత "అమ్మా" అని పిలుచుకునే స్థాయికి ఎదిగింది. జయలలిత జీవిత ప్రయాణం చాలామంది ప్రస్తుత రాజకీయ నేతలకు స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments