పెరిగిపోతున్న ఇండోనేషియా భూకంప మృతులు

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (19:59 IST)
ఇండోనేషియలోని ప్రధాన ద్వీపం జావా పశ్చిమ భాగంలో సోమవారం సంభవించి భారీ భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆరంభంలో కేవలం 46 మంది మాత్రమే చనిపోయినట్టు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. కానీ, ఇపుడు ఈ సంఖ్య 268కి పెరిగింది. సియాంజర్ పట్టణానికి సమీపంలోని 5.6 తీవ్రతతో ప్రకంపనలు రాగా భారీ నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. 
 
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోది. ఈ భూకంపం సృష్టించిన విధ్వంసంలో వెయ్యికి మంది వరకు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. 
 
సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ భూకంపం వల్ల మరణించిన వారిలో అత్యధికులు చిన్నారులేనని వెల్లడించారు. విద్యార్థులు స్కూల్లో ఉండగా భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం అధికంగా జరిగినట్టు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments