Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్‌ యుద్ధ వీరుడి కన్నుమూత

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:38 IST)
భారత సైన్యంలో రెండో అత్యున్నత పురస్కారం మహావీర్‌ చక్ర గ్రహీత, కమొడోర్‌ కేపీ గోపాల్‌రావు(94) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. నౌకాదళ ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

చెన్నై, బసంత్‌నగర్‌లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గోపాల్‌రావు 1926 నవంబరు 13న తమిళనాడు మదురైలో జన్మించారు. 1950 ఏప్రిల్‌ 21న భారత నౌకాదళంలో చేరారు. 1971 ఇండో-పాక్‌ యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఆయనకు మహావీర్‌ చక్ర పురస్కారం దక్కింది. యుద్ధ సమయంలో డిసెంబరు 4న ‘ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌’కు ఆయన్ను కమాండింగ్‌ అధికారిగా నియమించారు.

తన బృందంతో పాక్‌ జలాల్లోకి చేరుకొన్న గోపాల్‌రావు.. కరాచీ పోర్టుపై బాంబులతో దాడి చేశారు. హార్బర్‌లో ఉన్న ఆయిల్‌, ఇతర పరికరాలను నాశనం చేశారు. అప్పటి విజయానికి గుర్తుగానే ప్రస్తుతం డిసెంబరు 4న నేవీ డే నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments