Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్‌ యుద్ధ వీరుడి కన్నుమూత

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:38 IST)
భారత సైన్యంలో రెండో అత్యున్నత పురస్కారం మహావీర్‌ చక్ర గ్రహీత, కమొడోర్‌ కేపీ గోపాల్‌రావు(94) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. నౌకాదళ ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

చెన్నై, బసంత్‌నగర్‌లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గోపాల్‌రావు 1926 నవంబరు 13న తమిళనాడు మదురైలో జన్మించారు. 1950 ఏప్రిల్‌ 21న భారత నౌకాదళంలో చేరారు. 1971 ఇండో-పాక్‌ యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఆయనకు మహావీర్‌ చక్ర పురస్కారం దక్కింది. యుద్ధ సమయంలో డిసెంబరు 4న ‘ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌’కు ఆయన్ను కమాండింగ్‌ అధికారిగా నియమించారు.

తన బృందంతో పాక్‌ జలాల్లోకి చేరుకొన్న గోపాల్‌రావు.. కరాచీ పోర్టుపై బాంబులతో దాడి చేశారు. హార్బర్‌లో ఉన్న ఆయిల్‌, ఇతర పరికరాలను నాశనం చేశారు. అప్పటి విజయానికి గుర్తుగానే ప్రస్తుతం డిసెంబరు 4న నేవీ డే నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments