Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో విండో సీటు కావాలా... రూ.2 వేలు చెల్లించాలి...

ఠాగూర్
మంగళవారం, 9 జనవరి 2024 (13:40 IST)
తమ ప్రయాణికులకు ప్రైవేట్ విమాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన విమానాల్లో విండో సీటు కావాలనుకునేవారికి ఓ ఆఫర్ ప్రకటించింది. విండో సీటు కావాలంటే రూ.2 వేలు చెల్లించాలని తెలిపింది. 
 
ప్రయాణికులకు సౌకర్యవంతంగా కాస్త ఎక్కువ 'లెగ్ రూమ్' ఉండే ముందు వరుస సీట్ల బుకింగ్‌పై రూ.2000 ఫిక్స్డ్ ఛార్జీ నిర్ణయించింది. ఇక విండో సీటు బుకింగుపై రూ.2000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో వెబ్‌సైట్ పేర్కొంది. 222 సీట్లు ఉండే ఏ321 విమానం ముందు వరుసలో విండో సీటు బుకింగుపై రూ.2000, నడక దారి సీటు బుకింగుపై రూ.1500, అదేవరుసలోని రెండో, మూడో సీట్ల బుకింగుపై రూ.400 ఛార్జీలు ఉంటాయని తెలిపింది. 232 సీట్లు ఉన్న ఏ321 ఫ్లైట్, 180 సీట్లు ఉన్న ఏ320 ఫ్లైట్‌పై కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. 
 
ప్రయాణికులు ఒకవేళ ప్రాధాన్య సీటు అవసరంలేదనుకుంటే ఛార్జీలు లేని సీటును ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ సమయంలో సీటును కేటాయిస్తారని ఇండిగో వెబ్సైట్ పేర్కొంది. కాగా ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. దేశీయ విమానయానరంగంలో 60 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments