Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో నేటికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఓ యేడాది

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (09:11 IST)
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ గత యేడాది జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభిచారు. ఈ కార్యక్రమం గత యేడాది కాలంగా దిగ్విజయంగా సాగుతోంది. అంటే ఈ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించి ఒక యేడాది కాలం పూర్తి చేసుకుంది. ఫ్రంట్ లైన్ వారియర్లతో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ గత యేడాది కాలంలో ఎన్నో మైలు రాళ్లను అధికమించింది. 
 
టీకాపై ఎన్నో అపోహలు, భయాలు ఉత్పన్నమైన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్లు అందించడం ప్రారంభించింది. ఎన్నో అనుమానాల మధ్య ప్రారంభమైన ఈ ప్రక్రియ ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. 
 
ఈ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేటికి ఒక యేడాది పూర్తవుతున్న వేళ 156 కోట్ల కరోనా టీకాల పంపిణీ మైలురాయిని అధికమించింది. అందులో 90 కోట్ల మందికి పైగా మొదటి డోసు టీకా వేయగా, 62 కోట్ల మందికి రెండు డోసుల టీకాను వేశారు. 42 లక్షల మందికి బూస్టర్ డోస్ టీకాలను వేశారు. తద్వారా ప్రపంచంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు. 
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు 5.2 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు 2.94 కోట్ల మొదటి డోస్ టీకాలను, 2.7 కోట్ల రెండు డోసుల టీకాలను పూర్తి చేశారు. అలాగే, కేవలం ఐదు లేదా ఆరు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments