Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో నేటికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఓ యేడాది

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (09:11 IST)
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ గత యేడాది జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభిచారు. ఈ కార్యక్రమం గత యేడాది కాలంగా దిగ్విజయంగా సాగుతోంది. అంటే ఈ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించి ఒక యేడాది కాలం పూర్తి చేసుకుంది. ఫ్రంట్ లైన్ వారియర్లతో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ గత యేడాది కాలంలో ఎన్నో మైలు రాళ్లను అధికమించింది. 
 
టీకాపై ఎన్నో అపోహలు, భయాలు ఉత్పన్నమైన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్లు అందించడం ప్రారంభించింది. ఎన్నో అనుమానాల మధ్య ప్రారంభమైన ఈ ప్రక్రియ ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. 
 
ఈ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేటికి ఒక యేడాది పూర్తవుతున్న వేళ 156 కోట్ల కరోనా టీకాల పంపిణీ మైలురాయిని అధికమించింది. అందులో 90 కోట్ల మందికి పైగా మొదటి డోసు టీకా వేయగా, 62 కోట్ల మందికి రెండు డోసుల టీకాను వేశారు. 42 లక్షల మందికి బూస్టర్ డోస్ టీకాలను వేశారు. తద్వారా ప్రపంచంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు. 
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు 5.2 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు 2.94 కోట్ల మొదటి డోస్ టీకాలను, 2.7 కోట్ల రెండు డోసుల టీకాలను పూర్తి చేశారు. అలాగే, కేవలం ఐదు లేదా ఆరు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments